NRI-NRT

ప్రధాని మోదీ– జో బైడెన్‌ కీలక భేటీ

ప్రధాని మోదీ– జో బైడెన్‌ కీలక భేటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి సమాంతరంగా ఇది జరుగుతుందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఇండో–పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటులో పురోగతి, మౌలిక వసతులపై బైడెన్, మోదీ చర్చిస్తారన్నారు.