కమర్షియల్ సినిమాల్లో ఐటెంసాంగ్ను జత చేయడం..అందులో అగ్ర కథానాయికలు తమ ఆటపాటలతో అలరించే ట్రెండ్ గత కొన్నేళ్లుగా పాపులర్ అయింది. ఈ వరుసలో చాలా మంది టాప్ హీరోయిన్లు ప్రత్యేక గీతాల్లో భాగమయ్యారు. మంగళూరు సోయగం పూజాహెగ్డే సైతం ‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేలు రాణి..’ పాట ద్వారా యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత మరే ఐటెంసాంగ్లో నర్తించని ఈ భామ తాజాగా ‘ఎఫ్-3’ సినిమాలో ఓ హుషారైన గీతంలో పాలుపంచుకోనుందట. వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం మే 27న విడుదలకానుంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో పూజాహెగ్డే నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. తనదైన శైలి మాస్ బాణీలతో ఐటెంసాంగ్స్కు రూపకల్పన చేసే దేవిశ్రీప్రసాద్ ‘ఎఫ్-3’ కోసం ఓ హుషారైన పాటను సిద్ధం చేశారని అంటున్నారు. పూజాహెగ్డే ఐటెంసాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెబుతున్నారు.