Politics

మానవత్వం చాటుకున్న మాజీ ఉపసభాపతి

మానవత్వం చాటుకున్న మాజీ ఉపసభాపతి

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మానవత్వం చాటుకున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయిన దంపతులను బుద్ధప్రసాద్ తన కారులో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి జాయిన్ చేవారు. నాగయాలంక నుంచి అవనిగడ్డ వస్తుండగా వేకనూరు వద్ద మోటార్ సైకిల్ ప్రమాదానికి గురికావడంతో కోపనాతి రాజు దంపతులు గాయపడ్డారు. అటుగా వెళుతున్న బుద్ధప్రసాద్ గాయపడిన వారిని తన కారులో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.