రకుల్ ప్రీత్సింగ్ హవా ఈమధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. నవతరం కథానాయిక స్పీడుని రకుల్ అందుకోలేకపోతోంది. అయితే ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ రకుల్ తలుపు తట్టినట్టు ఫిల్మ్నగర్ వర్గాల టాక్. అజిత్ కథానాయకుడిగా వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో కథానాయికగా రకుల్ని ఎంచుకున్నట్టు టాక్. అజిత్తో నటించడం ఆమెకు ఇదే తొలిసారి. బోనీకపూర్, జీ స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్తో పాటు, టబు కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. అజిత్ సినిమా అంటే… ఆ క్రేజే వేరు. అందులో కథానాయికగా అవకాశం దక్కిందంటే.. రకుల్ జాతకం తిరగబడినట్టే.