Sports

జర్మనీపై భారత్‌ ఘన విజయం

జర్మనీపై భారత్‌ ఘన విజయం

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ టోర్నీలో భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్‌ తరఫున వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 2 గోల్స్‌ (18వ నిమిషం, 27వ నిమిషం) చేయగా… 45వ నిమిషంలో అభి షేక్‌ మరో గోల్‌ నమోదు చేశాడు. తాజా ఫలితంతో 11 మ్యాచ్‌ల ద్వారా 24 పాయింట్లు సాధించిన భారత్‌ లీగ్‌లో అగ్ర స్థానంలోనే కొనసాగనుంది. లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ నేడు జరుగుతుంది.