Movies

నా కుటుంబమే ఇంటి నుంచి గెంటివేసింది

నా కుటుంబమే ఇంటి నుంచి గెంటివేసింది

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో అనేక ఆసక్తికరమైన అంశాలు, వివాదాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎమ్‌ఎక్స్ ప్లేయర్, ఏఎల్‌టీ బాలాజీలో ఈ షో ప్రసారం అవుతోంది. ఈ మధ్య జరిగిన ఓ ఎపిసోడ్‌లో పూనమ్ పాండే తన గతాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైంది. ఇతర కంటెస్టెంట్‌లతో తన గతాన్ని పంచుకుంది.
పూనమ్ పాండే మూడు, నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలసి నివసించేది. ఫ్యామిలీ మొత్తం కలసి ఎటువంటి కారణం లేకుండానే తనను ఇంటి నుంచి గెంటి వేశారని చెప్పింది. తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని, చెడుగా ఏం చెప్పలేదని తెలిపింది. తన పనిలో తాను బిజీగా ఉన్నానని వెల్లడించింది. ఈ కథను గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీళ్లను ఆపులేకపోయింది. ప్రతి ఒక్కరూ తన గురించి చెడుగా అనుకుంటున్నారని పేర్కొంది. ‘‘నా గురించి చెడుగా మాట్లాడే ముందు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి’’ అని పూనమ్ చెప్పింది. ఇక పూనమ్ పాండే వ్యక్తిగత జీవితానికి వస్తే.. శామ్‌ బాంబే అనే వ్యక్తితో రెండేళ్లు సహజీవనం చేసింది. తర్వాత గతేడాది సెప్టెంబర్‌1న అతడిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె గృహహింస కేసు పెట్టింది. తర్వాత భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది.