Movies

స్వర్ణదేవాలయంలో మిసెస్ ‘సి’

స్వర్ణదేవాలయంలో మిసెస్ ‘సి’

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనలది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. భర్తకు సంబంధించిన పనుల్ని, బాధ్యతల్ని ఎంతో అంకిత భావంతో స్వీకరిస్తుంటుంది ఆమె. తమకు సంబంధించిన ప్రతీ విషయాన్ని చాలా ఓపెన్ గా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసే ఆమె.. తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ విషయాన్ని తెలియచేశారు. RC15 షూటింగ్ తాజా షెడ్యూల్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో చరణ్, ఉపాసన అమృతసర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు.  సిక్కులు పరమ పవిత్రంగా భావించే లంగర్ సేవా నిర్వాహణను చెర్రీ చేపట్టాడు. అయితే షూటింగ్ కారణంగా ఆ సేవకు చరణ్ హాజరు కాలేకపోయాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ దానికి సంబంధించిన విశేషాల్ని తెలిపారు ఉపాసన.‘కృతజ్ఞతా చిహ్నంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు.ఆయన RC15 షూటింగ్‌లో ఉన్నందున, సేవలో పాల్గొనడం ద్వారా ఆయనకి ప్రాతినిధ్యం వహించే హక్కు, అవకాశం నాకు లభించాయి. నాకు, చరణ్ కు మీ ప్రేమాభిమానులు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను…’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.