DailyDose

బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్ జిల్లా టూర్లు

Auto Draft

జగన్ ఒక్కసారిగా జోరు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ వ్యవధి ఉండగానే ఆయన ఇంటిని చక్కబెడుతున్నారు. రచ్చకు కూడా రెడీ అవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణతో వివాదాలు ముదిరి కొంప కొల్లేరు అవుతుంది అన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ మొత్తానికి సాఫీగానే కధను ముగించారు. ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన పార్టీని కూడా గాడిన పెడుతున్నారు. సీనియర్లకు పగ్గాలు అప్పగించారు.

ఇక వైసీపీ ప్లీనరీ ఒకటి ముందు ఉంది. జూలైలో దాన్ని పూర్తి చేసిన మీదట జగన్ జిల్లా టూర్లు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. రానున్న రెండేళ్ళూ జనంలోనే ఉండాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. జగన్ జిల్లా టూర్ల కోసం బుల్లెట్ ప్రూవ్ బస్సులను రెడీ చేస్తున్నారు. ఇప్పటిదాకా పర్యటనల కోసం కార్లతో జగన్ కాన్వాయ్ తిరిగేది.ఇపుడు బుల్లెట్ ప్రూవ్ బస్సుల్లో జగన్ జిల్లాలలో కలియతిరుగుతారు అని అంటున్నారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడంతో పాటు జనాల సమస్యలను నేరుగా తెలుసుకుంటారని అంటున్నారు. ఈ మేరరకు ఆర్టీసీ రెండు బుల్లెట్ ప్రూవ్ బస్సులను ఒక పాంట్రీ వాహనాన్ని రెడీ చేయాలై ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది.

భద్రతాపరమైన చర్యలలో భాగంగానే బుల్లెట్ ప్రూవ్ బస్సులను సీఎం ఉపయోగిస్తారు అని అంటున్నారు. ఈ బుల్లెట్ ప్రూవ్ బస్సులను గతంలో ఏపీ సర్కార్ కొనుగోలు చేసింది. మొత్తానికి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ముహూర్తం తేదీ అన్నది తొందరలో చెబుతారు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.