Movies

హద్దులు దాటి నటించను!

హద్దులు దాటి నటించను!

ప్రేక్షకులు తనను మంచి నటిగానే గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నది అగ్ర తార కీర్తి సురేష్‌. గ్లామర్‌ పాత్రలు తన మొదటి ప్రాధాన్యం కానేకాదని చెప్పింది. కమర్షియల్‌ సినిమాలో హద్దు దాటి కనిపించడం తన వల్ల కాదంటున్నది. నటిగా గుర్తింపుతో పాటు విజయాలను ఆశిస్తున్నట్లు తెలిపింది. కీర్తి సురేష్‌ స్పందిస్తూ…‘నటిగా నా అభినయం ప్రేక్షకులు ఇష్టపడాలని కోరుకుంటాను. అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న నాయిక పాత్రలే నాకు దక్కుతున్నాయి. వాటితోనే మీ ఆదరణ పొందుతున్నాను. నటిగా కమర్షియల్‌ సినిమాలతో పాటు ఆర్ట్‌ ఫిలింస్‌ చేయాలనుకుంటున్నాను. ఇలా బ్యాలెన్స్‌ చేయడం వల్ల పరిపూర్ణ నటిగా మీకు గుర్తుంటాను. తెరపై ఎలా కనిపించాలి అనే విషయంలో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. అవి దాటి నటించను’ అని చెప్పింది. కీర్తి సురేష్‌ ప్రస్తుతం మహేష్‌ బాబు సరసన ‘సర్కారు వారి పాట’, చిరంజీవితో ‘భోళా శంకర్‌’, నానికి జోడీగా ‘దసరా’ చిత్రాల్లో నటిస్తున్నది. మరిన్ని ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.