సింగర్ సునీత గాత్రంతోనే కాకుండా అందమైన రూపంతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గతేడాది రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సునీత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. ఇక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటున్న సునీత తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా ఆమె మామిడి తోటలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. బ్లెస్డ్ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట జోరుగా చర్చ మొదలైంది. మరోసారి సునీత తల్లి కాబోతుంది అంటూ వార్తలు వైరల్గా మారాయి. దీనిపై స్పందించిన సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.’దేవుడా.. జనాలు ఇంత క్రేజీగా ఉన్నారేంటి. మామిడి కాయలతో ఫోటో దిగి పోస్ట్ చేస్తే ఏదేదో ఊహించుకొని రాసేశారు. దయచేసి ఇలాంటి వదంతులు ప్రచారం చేయకండి. మీకో దండం రా నాయనా’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో సునీత ప్రెగ్నెంట్ అంటూ వస్తోన్న వార్తలను చెక్ పెట్టినట్లయ్యింది.