DailyDose

అమెరికాలో తెలంగాణ విద్యార్థుల మృతిపై గవర్నర్​ సంతాపం

అమెరికాలో తెలంగాణ విద్యార్థుల మృతిపై గవర్నర్​ సంతాపం

అమెరికాలో ఈ నెల 21న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతిపై గవర్నర్​ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థులను త్వరగా రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజ్​భవన్​ అధికారులను ఆదేశించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతిపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతాపం ప్రకటించారు. మృతదేహాలను భారత్​కు తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్ అధికారులను ఆదేశించినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇక ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురికి మెరుగైన వైద్య సహాయం అందించేలా విదేశీ వ్యవహారల శాఖను కోరారు.