NRI-NRT

దుబాయిలో తెదేపా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ

దుబాయిలో తెదేపా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ

యూఏఈ తెదేపా ఆధ్వర్యంలో దుబాయ్ ఆదివారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. తెదేపా నేత షేక్ ఖాదర్ బాషా కుమార్తె షేక్ వఫిఖా చేతులమీదుగా వీటిని అందజేశారు. హౌస్ మెయిడ్లుగా ఉన్న కరవా ప్రాంతంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున సుమారు 500 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ రంజాన్ మాసం తమకెంతో పవిత్రమైనదని.. తెదేపా ఆధ్వర్యంలో ఇలా బియ్యం పంపిణీ చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పార్టీ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కోడి రవికిరణ్, కందుల పార్థసారథి, వినోర్రెడ్డి మాదా తదితరులు పాల్గొన్నారు.
bb