Devotional

రోగాలను నయం చేసే ఉన్కేశ్వర్- – TNI ఆధ్యాత్మికం

రోగాలను నయం చేసే ఉన్కేశ్వర్- – TNI ఆధ్యాత్మికం

1. రామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్నంత పుణ్యమట. అంతేకాదు ఈ శివుడ్ని ప్రత్యేకంగా రోగనాశకుడిగా చెబుతారు. క్కడి వేడినీళ్ల కుంటలో స్నానమాచరిస్తే శరీరం ఆరోగ్యవంతమవుతుందట. ఆ సుప్రసిద్ధ క్షేత్రమే మహారాష్ట్రలోని..ఉన్కేశ్వర్‌!రామచంద్రమూర్తి వనవాస కాలంలో అనేకానేక అడవుల్లో పర్యటించాడంటారు. అందులో భాగంగానే ఉన్కేశ్వర్‌ సమీపంలో సీతాలక్ష్మణ సమేతంగా నివాసమున్నాడట. ఆ సమయంలోనే ఓ భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించాడట. క్తుడి మీద అపార కరుణావాత్సల్యాలు కలిగి ఉండే దశరథనందనుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలోని శివుడూ విశేష మహిమాన్వితుడే. అందుకే త్రేతాయుగం నుంచీ నేటి వరకూ ఈ చోటికి భక్తులు బారులు కడుతూనే ఉన్నారు. ఉన్కేశ్వర్‌ శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ తాలూకా మాండ్వి దండకారణ్యం పరిసరాల్లో విరాజిల్లుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌సరిహద్దులో ఉన్న ఈ దేవాలయంలో భక్తులకు ఉచిత ప్రకృతి వైద్యమూ అందిస్తున్నారు. అందులోనూ చర్మవ్యాధులు బాగా నయమవుతాయని భక్తుల నమ్మిక.
**స్థల పురాణం..
ఉన్కేశ్వర్‌ దండకారణ్యంలో శ్రీరామచంద్రుడు పాదం మోపడంతో పరిసర ప్రాంతమంతా పవిత్రమైందని చెబుతుంటారు. వాల్మీకి రామాయణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. పూర్వం శర్భంగుడు అనే ఋషి ఉన్కేశ్వర్‌ పరిసరాల్లోని దట్టమైన అడవుల్లో రామజపం చేస్తుండేవాడట. అతనికి చర్మవ్యాధులు సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయినా క్షణం విరామం లేకుండా రామనామాన్ని స్మరిస్తూనే ఉండడాన్ని శ్రీరామచంద్రుడు గ్రహించాడట. అందుకే ఆయన వనవాస కాలంలో ఉన్కేశ్వర్‌ దండకారణ్యం లోకి వచ్చి శర్భంగుడ్ని కలవాలను కున్నాడట. అయితే రాముడిని దర్శించుకోవడానికి శర్భంగుడు తన రూపాన్ని అడ్డంకిగా భావించాడు. ఆ విషయాన్ని లక్ష్మణుడు పసిగట్టాడు.ఈ విషయాన్ని రాముడికి వివరించాడు. చలించిపోయిన రాముడు ఉన్కేశ్వర్‌వైపు రెండు బాణాలు సంధించాడట. అందులో ఒకటి వ్యాధులను మటుమాయంచేసే సరోవర స్థాపనకూ, మరొకటి మహాశివ లింగ ప్రతిష్ఠాపనకూ కారణమయ్యాయి. అనంతరం శర్భంగ ఋషికి దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు తొలుత వేడినీటి సరోవరంలో స్నానమాచరించి, మహా శివలింగాన్ని పూజించమని చెప్పాడు. అలాచేసిన శర్భంగఋషి వ్యాధులన్నీ మటుమాయమయ్యాయి. అనంతరం అటవీ పరిసరాల్లోని ఎందరికో ప్రకృతి వైద్యం అందజేసిన శర్భంగ ఋషి జీవసమాధి అయ్యాడట. ప్రస్తుత దేవాలయం ఆయన సమాధి దగ్గరే నిర్మించారట.
**రాణి హయాంలో..
8వ శతాబ్దంలో మాల్వ రాజ్యాన్ని ఏలిన అహల్యాబాయి సాహిబా హోల్కర్‌, తన హయాంలో దేశవ్యాప్తంగా ప్రజల సౌకర్యార్థం నీటి కుంటలూ, బావులూ, పుష్కరఘాట్లూ, విశ్రాంతి భవనాలతోపాటూ, దేవాలయాలను నిర్మించారు. వీటితోపాటు దేవతలు కొలువైన కాశీ, గయా, అయోధ్య, ద్వారక, మధుర, జగన్నాధపురి తదితరచోట్ల పలు ఆలయాల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే ఉన్కేశ్వర్‌ శివాలయాన్నీ నిర్మింపజేశారట.
**రోగవిముక్తి..
ఆలయంలోని వేడినీటి సరోవరంలో కొన్నిరోజులపాటు వరుసగా స్నానమాచరిస్తే ఎంతటి చర్మవ్యాధులైనా యమవుతాయన్నది భక్తుల నమ్మకం. అక్కడి నీళ్లలో ఉండే సల్ఫర్‌ వల్ల ఇది సాధ్యమవుతోందన్నది నిపుణుల మాట. అందుకే దేశం నలుమూలల నుంచి ఎందరో వ్యాధిగ్రస్తులు ఇక్కడికొస్తుంటారు. ఆలయం వారే ఇక్కడ ఒక ప్రకృతి వైద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. దాజీ అనే ప్రకృతి వైద్యుడు చాలా కాలంగా ఇక్కడ సేవలందిస్తున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆశ్రమంలో రోగులు ఉండేందుకు వసతి సదుపాయం ఉంది. ఈ సేవలన్నీ ఉచితమే. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 100 మందికిపైగా రోగులు వైద్యం పొందుతున్నారు. వీరంతా రోజూ ఇక్కడి వేడినీటి సరోవరంలోని నీటితో స్నానమాచరించి, దైవదర్శనం చేసుకున్న తర్వాత దాదాజీ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం, తదితర వ్యాయామాలు చేస్తారు. తెల్లమచ్చలు, సొరియాసిస్‌, పక్షవాతం, స్కెలిరోడర్మ తదితర వ్యాధులవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.
**నిత్య హారతి… అన్నదానం..
శైవ సంప్రదాయం ప్రకారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తారు. తెల్లవాజామున బ్రహ్మముహూర్తంలో హారతితో పూజ మొదలవుతుంది. అనంతరం గాయత్రి మంత్ర జపంతో ఆలయం మార్మోగుతుంది. రోజూ భజనలు జరుగుతాయి. ఈ ఆలయంలో దత్తాత్రేయుడి ప్రతిమా ఉంది. మహాశివరాత్రి, దత్తజయంతి, రామనవమి, వినాయక చవితి పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, దత్తజయంతులకి జాతర కూడా చేస్తారు. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల మరాఠాలతో పాటు తెలుగు భక్తులూ పెద్ద ఎత్తున ఆలయానికి వస్తారు. రోజూ ఇక్కడికి వచ్చే భక్తులతోపాటు, వైద్యం పొందేవారికి అన్నదానం జరుగుతుంది.
*ఇలా వెళ్లాలి..
నాందేడ్‌ నుంచి 124 కిలోమీటర్లు, ఆదిలాబాద్‌ నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లడానికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ఉదయంపూట నిరంతరం బస్సులూ, ఇతర వాహనాలూ తిరుగుతుంటాయి.

2. వెంకన్న సేవలో జస్టిస్‌ దుర్గాప్రసాద్‌
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

3. ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవాలు
సత్యసాయి బాబా శివైక్యం చెందిన రోజును పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆదివారం ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. తన బోధనల ద్వారా సత్యసాయి బాబా ప్రేమతత్వాన్ని, సేవాతత్వాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. బాబా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. సత్యసాయి సేవాదళ్‌ ప్రపంచ వ్యాప్తంగా విద్య, వైద్యం, తాగునీరు, బాలవికాస్‌ విద్య, ఆధ్యాత్యిక భోదనలు, సత్యసాయి ప్రేమతత్వాన్ని ప్రపంచ ప్రజానీకానికి అందిస్తోందని తెలిపారు. శ్రీసత్యసాయి ఆర్గనైజేషన్‌ పేరిట నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

4. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తుల కోసం మే నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను మంగళవారం విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ‘తిరుపతి బాలాజీ. ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లో ఈ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఏప్రిల్‌ నుంచి ఈ దర్శనాలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఈ టోకెన్లు పొందిన భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని, నిర్దేశిత స్లాట్‌లో వచ్చి స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ తెలిపింది.

5. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

6. వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

7. భద్రాచలం కు రైలు మార్గం
భారతీయులకు ఇష్టమైన ఇలవేల్పు శ్రీరాముడికి సంబంధించి అత్యంత ప్రాశస్త్యం కలిగిన భద్రాచలం పట్టణానికి రైలు మార్గం అనేది తరతరాలుగా ప్రజలు ఎదురుచూస్తోన్న ముఖ్యాంశం. ప్రపంచం నలుమూలల నుంచి సీతారామచంద్రస్వామి సందర్శనకు వచ్చే భక్తులకు అనువుగా, ఆదివాసీ ప్రాంతంలో మెరుగైన రవాణా సౌకర్యాలకు వీలుగా భద్రాచలానికి ట్రాక్ వేసి రైలు నడుపుతామని చెప్పని ప్రభుత్వాలు, మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టని పార్టీలంటూ లేవు. ఈ క్రమంలోనే కొవ్వూరు-భద్రాచలం లైన్ పురుడుపోసుకుంది. కానీ దశాబ్దాలు గడుస్తున్నా దానికి మోక్షం దొరకలేదు. అయితే ఇప్పుడు, ఎట్టకేలకు రాములోరి సన్నిధికి రైలు రాకకు మార్గం దాదాపు సుగమమం అయింది. ఒడిశా వైపు నుంచి తెలంగాణలోని భద్రాలచలానికి రైలు మార్గం నిర్మాణం ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక సమీక్ష చేశారు. పూర్తి వివరాలివే..ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలానికి రైలు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఒడిశా–తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది ఏర్పాటుకానుంది. రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కొత్త లైన్‌ వేయనున్నారు. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం నాడు కీలక సమీక్ష నిర్వహించారు.

8. యాదాద్రి జిల్లాలోని భువనగిరి టీచర్స్ కాలనీ వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మిషన్ భగీరథ వాటర్ పైపును ఢీకొట్టింది. ప్రమాదంలో వాటర్ పైపు పగలడంతో నీరు రోడ్డుపైకి ఎగిసిపడుతున్నాయి. రోడ్డుపైకి వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

9. యాదాద్రి స‌న్నిధిలో సీఎం కేసీఆర్ దంప‌తులు
యాదాద్రి స‌న్నిధిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌ధానాల‌యంలో స్వామి వారిని కేసీఆర్ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం కేసీఆర్ దంప‌తుల‌ను అర్చ‌క బృందం ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.ఆ త‌ర్వాత రామ‌లింగేశ్వ‌ర స్వామి ఆల‌య ఉద్ఘాట‌న క్ర‌తువులో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ పాల్గొన్నారు. మ‌హా పూర్ణాహుతి, మ‌హాకుంభాభిషేకం పూజ‌ల్లో పాల్గొన్నారు. తోగుట పీఠాధిప‌తి మాధ‌వానంద స‌ర‌స్వ‌తి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాట‌న క్ర‌తువును నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జ‌గ‌దీష్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు

10. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించారు. పలువురు భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో బారులు తీరి, స్వామివారి దర్శనం చేసుకున్నారు.స్వామివారి దర్శనానికి మూడు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు చండీ హోమం, కుంకుమ పూజలు, గండదీపం మొక్కులు, సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.20లక్షల ఆదాయం సమకూరిందని, ఇవాళ 30వేల మంది వరకు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు