NRI-NRT

లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్ – యూకే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను అశోక్ గౌడ్ ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. 20001లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఎంతో ముందు చూపుతో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ప్రశంసించారు. ఎన్నారైలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తామని ప్రవాస తెలంగాణ వాదులు తెలిపారు.
Whats-App-Image-2022
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, రమేష్ ఇస్సంపల్లి, అధికార ప్రతినిధులు రవి కుమార్ రేతినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, నవీన్ మాదిరెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జి ప్రశాంత్ కటికనేని, మధు ఆబోతు, ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి , గణేష్ తదితరులు పాల్గొన్నారు.