టీఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖతార్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఖతర్ యువజన విభాగం అధ్యక్షుడు చింతకుంట మహేందర్ మాట్లాడుతూ..2001 లో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పాలనలోను తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ఏరియా ఇంచార్జ్ సుందరగరి శంకర్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి ఎల్లయ్య , మాసం రాజారెడ్డి, కందురి రాజు, మోతే ప్రవీణ్, మిస నర్సయ్య, బత్తిని భాస్కర్గౌడ్, సంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.