Movies

పక్కా మాస్‌ సర్కారు

పక్కా మాస్‌ సర్కారు

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. మే 2న థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మహేష్‌బాబు యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తున్నది.‘మునుపెన్నడూ చూడని విధంగా మహేష్‌బాబును మాస్‌ పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. త్వరలో నాల్గవ పాటను రిలీజ్‌ చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. చట్టంలోని లొసుగుల్ని అడ్టుపెట్టుకొని బడా బాబులు చేసే బ్యాంకు మోసాలు, రైతులు పడే ఇబ్బందుల్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.