మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు. సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ను ఆసక్తిగా గమనించారు. పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కాగా.. ప్రీమియర్స్ రూపంలో అమెరికాలో ఒక రోజు ముందుగానే విడుదలైన ఈ మూవీ.. రిలీజ్కు ముందే భారీ మొత్తంలో కలెక్షన్లను రాబట్టి అక్కడ రికార్డు సృష్టించింది. యూఎస్లో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారా 500లక్షల డాలర్లపైగా (సుమారు రూ. 3.82కోట్లు) వసూలు చేసిందని ప్రైమ్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అమెరికాలో ‘ఆచార్య’ సినిమా 400పైచిలుకు థియేటర్లలోని 3200పైగా స్క్రీన్లపై విడుదల చేసినట్టు ప్రైమ్ మీడియా చెప్పింది.