DailyDose

నేటి ప్రధాన వార్తలు

నేటి ప్రధాన  వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ నవోదయ ప్రవేశ పరీక్ష. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనున్న పరీక్ష.

ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు సదస్సు. ప్రారంభించనున్న ప్రధాని మోడీ. హాజరుకానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.

ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం. 64 అంశాలతో అజెండాను రూపొందించిన అధికారులు

తిరుపతిలో మే 5న సిఎం జగన్ చేతుల‌మీదుగా చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం

నేడు నంద్యాలలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

విశాఖలోని సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం టిక్కెట్లు అమ్మకాలు ప్రారంభం. సింహాచలం SBI, యూనియన్ బ్యాంకు ల ద్వారా 300రూపాయల టిక్కెట్ల విక్రయాలు. వచ్చే నెల 3న సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం