NRI-NRT

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు

లండన్‌లోని నవనాథ్ సెంటర్‌లో ఉగాది సంబరాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఘనంగా నిర్వహించింది. ఏప్రిల్ 30న జరిగిన ఈ వేడుకలకు లండన్, పరిసర ప్రాంతాల్లోని వందలాది తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా కొవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కోసం మౌనం పాటించి నివాళులర్పించారు. TAL కల్చర్ సెంటర్ (TCC) విద్యార్థుతో గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత గానం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ, సినీ సంగీత, నృత్యాలతో, విభిన్న కార్యక్రమలతో వేదిక హోరెత్తింది. వేడుకలకు హాజరైన వారికి సంప్రదాయ ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అందించారు.
ta2
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలుTAL ఛైర్‌పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ & కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి, కస్తూరి కిషోర్ పాల్గొన్నారు. కన్వీనర్ రవి సబ్బా సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి తన జీవిత విశేషాలను, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. UKలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో TAL చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి TAL నివాళులర్పించింది. తనికెళ్ళ భరణి తన ప్రసంగంలో సిరివెన్నెల కవితా ప్రయాణం సాహితీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని కొనియాడారు. TAL వార్షిక పత్రిక “మా తెలుగు” సావనీర్‌ను తనికెళ్ళ భరణి ఆవిష్కరించారు.
ta3
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలునల్గొండ గద్దర్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జానపద గాయకుడు కాసాల నర్సన్న, తాల్ కోసం ప్రత్యేక గేయాన్ని పాడారు. అలాగే RRR చిత్రంలోని “కొముర భీముడో” పాట తనదైన శైలిలో పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు ఆటో రామ్ ప్రసాద్, రౌడీ రోహిణి , బుల్లెట్ భాస్కర్ యాంకరింగ్ చేస్తూనే తమ హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు ధనుంజయ్, దామిని తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో, వారి గానంతో మైమరిపించారు.
ta4
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలుతెలుగు రచయిత నరేంద్ర మధురాంతకం మాట్లాడుతూ.. UKలో సంస్కృతి, సాహిత్యాన్ని పరిరక్షించడంలో TAL చేస్తున్న కృషిని కొనియాడారు. భారత హైకమిషన్ రెండవ కార్యదర్శి సంజయ్ కుమార్ నరేంద్రను సత్కరించారు. ప్రత్యేక అతిధులు, పార్లమెంటు సభ్యులు సీమా మల్హోత్రా, వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరానికి అందజేయడంలో TAL చేస్తున్న కృషిని ప్రశంసించారు. చివరగా TAL చైర్‌పర్సన్ భారతి కందుకూరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, ఈవెంట్ స్పాన్సర్‌లందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ta5
ta7
ta8