NRI-NRT

అమెరికాలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

అమెరికాలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

అమెరికాలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో దీనిని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్ర విభాగానికి అమెరికాలో సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన కోమటి జయరాం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం దీనికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.కోగంటి వెంకట్‌ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి పునర్‌వైభవం సాధించాల్సిన అవసరం ఉందని, ప్రవాసాంధ్రులంతా ఈ లక్ష్య సాధనకు టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో చెన్నుపాటి వజీర్‌, మన్నవ సుబ్బారావు, గుంటుపల్లి చంద్ర, దొడ్డపనేని శ్రీకాంత్‌, భల్ల భక్త, కాకర్ల రజనీకాంత్‌, ఆసూరి విజయ, కోమటి గంగ తదితరులు కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో టీడీపీ సభ్యత్వాన్ని తీసుకొన్నారు