DailyDose

ఫోన్ పే, గూగుల్ పే కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది?

ఫోన్ పే, గూగుల్ పే కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది?

నేటి జనరేషన్ కి యూపిఐ అనేది ఒక వరం అని చెప్పాలి. ఇది చాలా ఈజీగా జరిగే పేమెంట్ ప్రాసెస్. ఒకప్పుడు డబ్బులు కావాలన్నా లేక మిగతా వారికి పంపాలన్న బ్యాంకులు ఇంకా మని ఆర్డర్ ద్వారా పంపవలసి ఉంటుంది.దాని వల్ల సమయం వృధా అవుతుంది. అందువల్ల ఇక ఈ యూపిఐ విషయంలో ఇప్పుడు చాలా బాగా డిమాండ్ పెరిగింది. ఇంకా పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు చాలా మంది కూడా యూపిఐ సేవలను అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా వాడేస్తున్నారు.ఇక పేమెంట్ అనేది కూడా చాలా సులువుగా ఉండటంతో ప్రజలకు కూడా అసలు ఇబ్బంది అనేది లేకుండా పోయింది.చదువుకోని వారు కూడా యూపిఐ ద్వారా చాలా ఈజీగా కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా పేమెంట్స్ అనేవి చేస్తున్నారు.ఇక ఫోన్ పే ఇంకా అలాగే గూగుల్ పే వంటి వాటికి డబ్బులు ఎలా వస్తాయి అనే సందేహం చాలా మందిలో కూడా ఉంది. అసలు డబ్బులు ఎలా వస్తాయో ఒకసారి కనుక చూస్తే… ఫోన్ పే ఇంకా అలాగే గూగుల్ పే ద్వారా జరిగే డబ్బు మార్పిడికి ప్రతి వెయ్యి రూపాయలకు పావలా కమీషన్ అనేది వస్తుంది.ఇక పాతిక పైసలకు వాళ్ళకి కమిషన్ ఇస్తారు అన్నమాట. ఇది కూడా యూపీఐ పేమెంట్ ని ప్రోత్సహించడానికి గాను ఇస్తారు.

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాత్కాలికంగా ఇస్తున్న ఇన్సెంటివ్ ఇది. అయితే ఇప్పుడు దాన్ని నిలిపివేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏ కంపెనీ అయినా కాని యాప్ ని ఉచితంగా నడిపే అవకాశం అసలు ఉండదు. ఇక దాన్ని సంపాదించే మార్గాలను కూడా వాళ్ళు ఎంచుకుంటారు. ఫోన్ పే గూగుల్ పే మొదట డబ్బులు మాత్రమే పంపడానికి వాడే వాళ్ళు.ఇక ఇప్పుడు రీచార్జ్ లు, ఇన్స్యూరెన్స్ లు, సినిమా టికెట్ లు ఇంకా అలాగే హోటల్ బుకింగ్ వంటివి కూడా ఉన్నాయి. వీటి ద్వారా వాళ్లకు ఆదాయం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక వాటి ద్వారా ప్రమోషన్ చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలు.వాటి ద్వారా కూడా ఆదాయం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఫోన్ పే లో రీచార్జ్ కనుక చేసుకుంటే రెండు రూపాయలు కమీషన్ ని తీసుకుంటుంది. వంద రూపాయలు రీచార్జ్ చేసుకున్నా కూడా రెండు రూపాయలను ఇవ్వాలి.