యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఇటీవల ఆయన నటించిన ‘ఆచార్య’(Acharya) సినిమా విడుదలైంది. తదుపరి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’(Bhola shankar), ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు కూడా ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. రాధిక శరత్కుమార్ నిర్మాణంలో చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కరోనా పాండమిక్ తర్వాత వరుసగా షూటింగ్ల్లో పాల్గొన్న చిరు కాస్త విరామం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరారు. సతీమణి సురేఖతో కలిసి అమెరికా, యూరప్ ట్రిప్ వెళ్తున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘‘పాండమిక్ తర్వాత మొదటి ఇంటర్నేషనల్ ట్రావెల్. ఇది. చాలాకాలం తర్వాత సురేఖతో కలిసి అమెరికా, యూరప్ దేశాల్లో విహరించబోతున్నా’’ అని ట్రిప్కు సంబంధించిన ఫొటో షేర్ చేశారు చిరంజీవి (megastar chiranjeevi). ‘హ్యాపీ జర్నీ’, ‘ఎంజాయ్ ది ట్రిప్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/MusicThaman/status/1521284381330968576/photo/1
ఇది కాకుండా అభిమానులకు మరో శుభవార్త చెప్పారు చిరంజీవి. గాడ్ ఫాదర్ (God father) చిత్రంలో చిరంజీవి, సల్మాన్ఖాన్ కాంబినేషన్లో వచ్చే పాటకు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గతంలో కూడా చిరంజీవి–ప్రభుదేవా కాంబినేషన్లో సూపర్హిట్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో ‘గాడ్ ఫాదర్’పై మరింత ఆసక్తి పెరిగింది. మోహన్రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.