NRI-NRT

ఇద్దరు భాజపా నేతలకు ‘ఆటా’ మహాసభల ఆహ్వానం

ఇద్దరు భాజపా నేతలకు ‘ఆటా’ మహాసభల ఆహ్వానం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ 17వ కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ వాషింగ్టన్ డీసీ నగరంలోని వాల్టర్ కన్వెన్షన్ సెంటర్లో జులై 1వ తేదీ నుంచి 3 తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాసభలలో అతిరధ మహారధులు ఎందరో పాల్గొననున్నారు.
Whats-App-Image-2022-05
ఈ మ‌హా స‌భ‌లకు అతిధులుగా రావాల్సిందిగా తెలంగాణ రాజకీయ నాయకులు కరీంనగర్ నియోజకవర్గ లోక్ సభ సభ్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ లను ఆటా ప్ర‌తినిధులు రఘువీర్ రెడ్డి మరియు శరత్ వేముల ఆహ్వానించారు. ఆటా మహసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.