మనఊరు- మన బడి కార్యక్రమానికి రాష్ట్రములోనే కాకుండా ఎన్నారైల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది , వరంగల్ లో జరిగిన softpath వార్షికోత్సవ కార్యక్రమములో ఎన్నారై రవిచందర్ 2 పాఠశాలలను దత్తత తీసుకున్నారు , మంత్రులు కేటీర్, ఎర్రబెల్లి దయాకర్ ,సత్యవతి రాథోడ్ మరియు వరంగల్ ప్రజా ప్రతినిధులు, మనఊరు మనబడి ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అద్వ్యర్యములో 20 లక్షల చెక్ ని మంత్రి కేటీర్ గారికి అందజేశారు. కేటీర్ గారు ఎన్నారై రవిచంద్రన్ ని ఇంతటి బృహత్తరమైన కార్యక్రమములో పలు పంచుకున్నందుకు అభినందించారు.మహేష్ బిగాల మాట్లాడుతూ సీఎం కెసిఆర్ గారు తలబెట్టిన ఇంతటి మంచి కార్యక్రమానికి అందరి సహకారం అవసరం , ఎన్నారైల భాగస్వామ్యం ఉండేట్టు ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్బంగా అన్నారు.