Politics

తెదేపాతో పొత్తు..పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెదేపాతో పొత్తు..పవన్ కల్యాణ్   ఆసక్తికర వ్యాఖ్యలు..

భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై పవన్‌ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.భాజపాతో మీ రిలేషన్‌ ఎలా ఉంది?
పవన్‌: అద్భుతంగా ఉంది.జనసేనకు భాజపా నేతలు రోడ్‌ మ్యాప్‌ ఇచ్చారా? లేదా?పవన్‌: ఏడుకోట్ల మంది ప్రజల సమస్య. చాలా ఆలోచించి కచ్చితంగా తీసుకుంటాం. రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన విషయాలు, వ్యూహాలు వెంటవెంటనే ఎందుకు చెప్తాం. సరైన సమయంలో పరిస్థితులను బట్టి చెప్తాం.భాజపా అధ్యక్షుడు రోడ్‌ మ్యాప్‌ ఇచ్చినట్లు చెప్పారు కదా?పవన్‌:అన్నారా.. మీరు చెప్పింది ఒకసారి పరిశీలించి చెప్తాను.భాజపాతో కలిసి పనిచేస్తున్నామని చెబుతూ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కదా?పవన్‌: పోరాటం ఒంటరిగా ఎక్కడ చేస్తున్నాం? ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది.. కచ్చితంగా చేస్తాం.పొత్తులపై తెదేపా మిమ్మల్ని ఆహ్వానిస్తే మాట్లాడతారా? లేదా?
పవన్‌: రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తాం.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు కదా.. అలా జరగకుండా ఎలా ముందుకెళ్తారు?పవన్‌: ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నా.