Politics

మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు

మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు

ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరైంది. వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని మెజిస్ట్రేట్ తెలిపింది. టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను మంగళవారం హైదరాబాద్‎లో అరెస్ట్ చేసి చిత్తూరు తరలించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం నారాయణ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా..2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ తరపు న్యాయవాదులు పేపర్లతో సహా ఆధారాలను న్యాయమూర్తికి చూపించారు. దీంతో పోలీసుల అభియోగాన్ని మెజిస్ట్రేట్ తోసిపుచ్చింది.