DailyDose

నువ్వలరేవులో సామూహిక వివాహాలు.. ఒకేసారి ఒక్కటైన 43 జంటలు!

Auto Draft

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో గ్రామ సంప్రదాయం ప్రకారం గురువారం రాత్రి 10.11 గంటలకు సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు. ఒకేసారి 43 జంటలు ఒక్కటయ్యాయి. ఉదయం బృందావతి ఆలయంలో పూజలు చేసిన తర్వాత, పెళ్లి బాజాల మధ్య కాబోయే వధూవరులు మంగళస్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం వధువులను సంప్రదాయ పెళ్లి దుస్తులతో అలంకరించి వారి వారి ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన పీటలపై కూర్చోబెట్టి బంధువులు కరెన్సీ నోట్లను తగిలిస్తూ అభినందనలు తెలిపారు. రాత్రి 10.11 గంటలకు ఒకే లగ్నంలో పెళ్లి కుమారులంతా తాళి కట్టారు. అనంతరం వధువులు తమ ఇళ్లలో పంచలోహాలతో తయారు చేసిన సంప్రదాయ పొడులతో కూడిన పొట్లాలను పెళ్లి కుమారుల మెడల్లో మూడు ముళ్లేసి కట్టడంతో వివాహ తంతు ముగిసింది.