సిలికానాంధ్ర మనబడి విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో శని, ఆదివారాల్లో ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మనబడి డీన్ చామర్తి రాజు ‘TNI’ కు తెలిపారు. శనివారం నాడు 1830 మంది జూనియర్ విద్యార్థులు, ఆదివారం నాడు 1165 మంది సీనియర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. అమెరికాలోని 27 రాష్ట్రాల నుండి విద్యార్థులు ఆన్లైన్ విధానంలో పరీక్షలకు హాజరవుతున్నట్లు చామర్తి రాజు తెలిపారు. అర్హత పొందిన వారికి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి సర్టిఫికెట్లు జారీ చేస్తారని తెలిపారు.