కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ బాలీవుడ్ జంట ఇప్పుడు అమెరికా టూర్లో ఉంది. అయితే ఇటీవల ఆ కొత్త జంట న్యూయార్క్ వెళ్లింది. ఆ నగరంలో ప్రియాంకా చోప్రాకు చెందిన రెస్టారెంట్ను కత్రినా-విక్కీ జంట వెళ్లింది. సోనా పేరుతో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.. న్యూయార్క్లో రెస్టారెంట్ను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్ను విజిట్ చేసిన తర్వాత కత్రినా కైఫ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోను పోస్టు చేసింది. ఇంటికి దూరంగా మరో ఇల్లు లాంటి ప్రదేశమని తన పోస్టులో కీర్తించింది. అయితే కత్రినా పెట్టిన క్యాప్షన్కు ప్రియాంకా కూడా రియాక్ట్ అయ్యింది. సోనా రెస్టారెంట్ మీకెప్పటికీ స్వాగతం పలుకుతుందని ఆ పోస్టులో ప్రియాంకా వెల్లడించింది.
ప్రియాంకా చోప్రా రెస్టారెంట్కు వెళ్లిన కత్రినా-విక్కీ జంట..
