WorldWonders

ఆ ట్రైన్ అందరికీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. నో టికెట్, నో ఫైన్!

ఆ ట్రైన్ అందరికీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. నో టికెట్, నో ఫైన్!

మన దేశంలో మాక్సిమం అందరూ రైలు ప్రయాణాన్నే ఇష్టపడతారు.ఎందుకంటే ఎంతో చౌకైనది. సౌకర్యవంతమైనది కనుక.దాంతో రోజూ కోట్లాది మంది ప్రజలు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుతూ వుంటారు. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, శతాబ్ధి, హంసఫర్, గరీభ్‌‌రథ్, వందేభారత్ వంటి ఎన్నో భిన్న రకాల రైళ్లు మన దేశంలో మనం చూడవచ్చు.అయితే వీటిలో ఎందులో ప్రయాణించాలన్నా టికెట్ తప్పనిసరి. అయితే, మనదేశంలో టికెట్ అవసరం లేకుండా, పూర్తి ఉచితంగా ప్రయాణించగలిగే.రైలు ఒకటి ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆ ట్రైయిన్‌లో టికెట్‌ ఫ్రీ.పైగా ఎలాంటి ఫైన్‌ కూడా ఉండదు. అదే భాక్రా నంగల్‌ ట్రైన్.
BK6
berkeley electric cooperative
అవును.హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న 13 కి.మీ.రైలు మార్గంలో ఈ ట్రైన్ మనకు కనబడుతుంది.అక్కడే ఇది నడుస్తుంది.ఇది సట్లెజ్ నది గుండా వెళుతుంది.నంగల్ నుండి ఉదయం 7గంటల 5నిమిషాలకు ఈ రైలు బ‌య‌ల్దేరుతుంది.సుమారు 8గంటల 20నిమిషాలకు ఈ రైలు భక్రా నుండి నంగల్‌కు తిరిగి వస్తుంది. నంగల్ నుండి భాక్రా డ్యామ్ చేరుకోవడానికి రైలు దాదాపు 40 నిమిషాలు పడుతుంది.ఈ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహిస్తోంది.
BK
కొండలు-కోనలు, వాగులు-వంకలు, ప్రకృతి సోయగాల మధ్య రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈ రైలులో వెళ్లే ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరు.ఈ రైలు ప్రత్యేకత ఏమంటే, ఇది పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది.రైలును ప్రారంభించినప్పుడు అందులో 10 కోచ్‌లు ఉండేవి. అవి క్రమేపి తగ్గిపోతూ ప్రస్తుతం 3 కోచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.దీనికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియదు. ఇక ఈ రైలులో ఒక కోచ్‌ను పర్యాటకులకు, మరొకటి మహిళలకు కేటాయించారు.ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ రైలులోని అన్ని కోచ్‌లు చెక్కతో తయారు చేశారు.భాక్రా-నంగల్ ఆనకట్టను వారసత్వ సంపదగా భావిస్తారు.అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.