అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్లోని ఓ సూపర్ మార్కెట్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. సూపర్ మార్కెట్లోకి సైనికుడి వేషంలో తుపాకీతో ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుశ్చర్యలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. దుండగుణ్ని ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనకు జాతి విద్వేషమే కారణమని వారు భావిస్తున్నారు. ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు.