Women Empowerment Telugu Association(WETA) ఆధ్వర్యంలో మేరీల్యాండ్లో హనోవర్లో మాతృదినోత్సవాన్ని ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. 600 మందికిపైగా మహిళలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సంస్థ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, తదుపరి అధ్యక్షురాలు శైలజ కల్లూరి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. స్థానిక సంగీతకారుల సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. పలు పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. WETA మీడియా నేషనల్ ఛైర్పర్సన్ సుగుణరెడ్డి, స్థానిక సభ్యులు ప్రీతీ రెడ్డి, యామిని రెడ్డి, నవ్యస్మృతి, జయం సుధా కొండపు, కవిత చల్ల, శ్రీధర్ నాగిరెడ్డి, డా. పల్లవి, రామ్మోహన్ కొండా, అనిత ముత్తోజు, అపర్ణ కడారి, సింగర్ మధు నెక్కంటి తదితరులు పాల్గొన్నారు.