NRI-NRT

ఎన్నారై తెదేపా అభిమానులతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆత్మీయ సమావేశం!

ఎన్నారై తెదేపా అభిమానులతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆత్మీయ సమావేశం!

అనంతపురం అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం మే 18న షార్లెట్ నగరంలో వైభవంగా జరిగింది. వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 250 మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు.
r7
బోస్టన్‌లో ఈ నెల 20, 21లో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడులో అతిథిగా పాల్గొననున్న ప్రభాకర్ చౌదరి మే 17న షార్లెట్‌కు చేరుకున్నారు. షార్లెట్‌లో అనంతపురం వాసులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువగా ఉండడంతో వారి కోరిక మేరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం.. మహానాడులో పాల్గొనేందుకు బోస్టన్ బయలుదేరి వెళ్లనున్నారు.NRI TDP అభిమానులతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆత్మీయ సమావేశం!షార్లెట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశాన్ని పురుషోత్తం చౌదరి గుడే, రవి నాయుడు, ఠాగూర్ మల్లినేని, వెంకట్ మాలపాటి, సచీన్ద్ర ఆవులపాటి, మహేష్ సూరపనేని, వెంకట్ సూర్యదేవర, కృష్ణ నరసింహ సమన్వయపరిచారు. ర్యాలీ నుంచి సురేష్ కాకర్ల, రామ్ అల్లు, సిద్ద కోనంకి, కేశవ్ వేముల తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
r5
పురుషోత్తం చౌదరి గుడే స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, పిల్లలు పుష్పగుచ్ఛంతో ప్రభాకర్ చౌదరికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, యువత తమ తమ ఆలోచనలను ప్రసంగ రూపంలో పంచుకున్నారు. అనంతరం ప్రభాకర్ చౌదరి ప్రసంగం ఆహ్వానితులందరినీ ఆలోచింపజేసింది.NRI TDP అభిమానులతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆత్మీయ సమావేశం!ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపన, విధివిధానాలు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అణగారిన వర్గాలకు అందింన చేయూత, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దురాగతాలు, స్వలాభాపేక్ష లేకుండా ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న వైనం, అలాగే బోస్టన్ మహానాడు ఆహ్వానం తదితర విషయాలపై ప్రభాకర్ చౌదరి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు అందించారు.
r6
ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయకర్తలు ప్రభాకర్ చౌదరిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. శాలువాతో సత్కరించబోగా ఆ శాలువాను తిరిగి ఠాగూర్ మల్లినేని కి కప్పి సత్కరించారు. తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఠాగూర్ లాంటి వాళ్ళను ముందు సత్కరించాలని ప్రభాకర్ చౌదరి అనడంతో సభికులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు.స్థానిక నేతలు పలువురిని పరిచయం చేస్తున్నప్పుడు కలివిడిగా తిరుగుతూ ప్రభాకర్ చౌదరి అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే మహిళలు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన తదనంతరం భోజనాలతో కార్యక్రమం ముగిసింది.