న్యూజెర్సీ లో ప్రముఖ తెలుగు సంఘం అయిన తెలుగు కళా సమితికి మే నెల 12,13 తేదీలలో హోరాహోరీగా జరిగిన ఎన్నికలల్లో అధ్యక్షునిగా మధు రాచకుళ్ళ తన సమీప ప్రత్యర్థి గురు ఆలంపల్లి పై సుమారు ౩౩5 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. న్యూజెర్సీలో తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తనకు ఈ అవకాశం కల్పించిన సభ్యులకు మధు రాచకుళ్ళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ ట్రస్టీలుగా రవి అన్నదానం, శ్రీమతి బిందు యలమంచిలి, శ్రీమతి అనూరాధ దాసరి మరియు శ్రీ శ్రీనివాస్ చెరువు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రస్టీలుగా సుధా దేవులపల్లి, శ్రీదేవి పులిపాక,జ్యోతి కామరాసు మరియు నాగ మహేందర్ వెలిశాల గెలుపొందారు.
google image search from phone gallery
2022-24 సంవత్సర కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల నిర్వహణాధికారి శంకరరావు పోలేపల్లి ప్రకటించారు. అధ్యక్షునిగా మధు రాచకుళ్ళ, ఉపాధ్యక్షులుగా శ్రీమతి అనూరాధ దాసరి, కార్యదర్శిగా శ్రీ రవి అన్నదానం, సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీమతి బిందు యలమంచిలి, మరియు కోశాధికారిగా శ్రీనివాస్ చెరువు, యువజన కార్యదర్శిగా శ్రీమతి సుధా దేవులపల్లి, సామాజిక కార్యదర్శిగా శ్రీమతి శ్రీదేవి పులిపాక, సర్వసభ్య కార్యదర్శిగా శ్రీమతి జ్యోతి కామరాసు మరియు సాంకేతిక కార్యదర్శిగా నాగ మహేందర్ వెలిశాల మే నెల 18 వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.