Movies

మాల్దీవుల తీరంలో అందాల రచ్చ

మాల్దీవుల తీరంలో అందాల రచ్చ

టాలీవుడ్‌లో అందాల రకుల్ ప్రీత్ సింగ్ కు కథానాయికగా సరైన గుర్తింపు రాలేదు. అగ్ర కథానాయకుల సరసన నటించినప్పటికీ ఆమె కెరీర్ కు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. రకుల్ తెలుగులో ఆఖరుగా నటించిన చిత్రం ‘కొండపొలం’ . వైష్ణవ్ తేజ్హీ రోగా క్రిష్తె రకెక్కించిన ఈ సినిమా ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఓ అరడజను చిత్రాల వరకూ లైన్ లో పెట్టుకొంది. వాటిలో కొన్ని సెట్స్ మీదుంటే. మరికొన్ని టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాయి. ఇంకొన్ని చిత్రాల్ని ప్లాన్ చేస్తోంది. అలాగే.. తమిళంలోనూ రకుల్ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కు సినిమాలతో పాటు మరో వ్యాపకం సోషల్ మీడియా.

ఓ రేంజ్ లో అక్కడ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తరచుగా తన హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూంటుంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు సరిపడే హాట్ స్టఫ్ ను ఆ వేదికనుంచి షేర్ చేస్తూంటుంది. స్కిన్ షోస్, బికినీ షూట్స్ లాంటివి తన ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేసి.. కుర్రకారును వెర్రెక్కిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారానికి వెళ్ళింది. తన బికినీ సొగసులతో సముద్ర తీరాన్ని వేడెక్కిస్తూ అందాల విందు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేసింది. ప్రస్తుతం రకుల్ బికినీ అందాల వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. బ్లూ కలర్ బికినీలో సాగరతీరాన మత్స్య కన్యలా రివీలయింది. ఈ వీడియోను చూడడానికి నెటిజెన్స్ కు రెండు కళ్ళూ చాలడం లేదు. రకుల్ టాప్ అండ్ బోటమ్ నాజూకు అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అసలే జీరో సైజుతో సన్నజాజి తీగెలా ఉండే రకుల్ ప్రీత్ .. ఈ పిక్స్ తో మెరుపుతీగలా కనిపిస్తోంది. మరి ఈ పిక్స్ తో అయినా ఆమెకి బాలీవుడ్ నుంచి అగ్ర సంస్థలనుంచి పిలుపొస్తుందేమో చూడాలి.