NRI-NRT

కువైత్ లో పోటాపోటీగా ‘మహానాడు’

కువైత్ లో పోటాపోటీగా మహానాడు

*కువైత్లో తెలుగు దేశం అభిమానుల సందడి
*కువైత్ ఎన్నారై టిడిపి అధ్వర్యంలో మహానాడు

కువైత్ లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు స్ధానికంగా మహానాడు మరియు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటాపోటిగా రెండు శిభిరాలు నిర్వహించిన మహానాడు విజయవంతమైంది.  కోడూరి వెంకట్ నేతృత్వంలోని కువైత్ ఎన్నారై టిడిపి సెల్ నిర్వహించిన మహానాడులో రాయలసీమ అభివృద్ధి కొరకు కడపలో చంద్రబాబు నాయుడు శంఖుస్ధాపన చేసిన ఉక్కు కార్మాగారం పనులలో ఏలాంటి పురోగతి లేదని  వక్తలు ఆక్షేపించారు. సంవత్సరం పొడువునా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని దీని కై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె. అచ్చంనాయుడు, శాసన సభ్యులు బాలకృష్ణాను కువైత్ కు ఆహ్వనించాలని మహానాడు తీర్మానించినట్లుగా వెంకట్ తెలిపారు. మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ బొర్రా ఎన్నారై టిడిపి కువైట్  మైనారిటీ విభాగం కమిటీ సభ్యులు, ఎన్నారై టిడిపి గల్ఫ్ కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులు ఎన్టీఆర్ పరిటాల ట్రస్ట్ మరియు చంద్రన్న సేవా సమితి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నారా, నందమూరి అభిమానులు అందరూ కలిసి పాల్గొని ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు.
283786470-413026663802232-4390734905262288706-n
దీనిలో భాగంగానే జూన్ 10న ఒక కార్యక్రమం చేయడానికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చం నాయుడు మరియు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను కూడా ఆహ్వానించడం జరిగిందని నిర్వహకులు తెలిపారు.  ఈ సందర్భంగా గౌరవ అతిథి వెంకట్ కోడూరి  మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు  ప్రజల ఆత్మగౌరవం కొరకు మరియు చంద్రబాబు తెలుగు జాతి అభివృద్ధి కోసం కష్టపడి చేసిన పనిను ప్రస్తుతం జగన్ నానశనం చేసారని వెంకట్ వ్యాఖ్యానించారు.  జగన్ ప్రభుత్వం మైనార్టీ హక్కుల, సంక్షేమ కార్యక్రమాలు విషయంలో అన్యాయం చేస్తుందని  మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ముస్తాక్ ఖాన్ అరోపించారు.
284310233-1072211250368378-5195722349921596530-n
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారని టీడీపీ గల్ఫ్ శంకర్  పెర్కోన్నారు. కడపలో పరిశ్రమల స్ధాపన కొరకు చంద్రబాబు నాయుడు చేసిన కృషిను గుర్తుంచుకోవాలని ఓలేటి రెడ్డయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో  బాలారెడ్డయ్య,  విజయ్ కుమార్, ఖదీర్ బాషా, గౌహర్ అలీ, నారాయణమ్మ, అంజలి, అంజనా రెడ్డి , నిర్మలమ్మ, కరీముల్లా తదితరులు పాల్గొనగా, కార్యక్రమాన్ని ఎన్నారై టిడిపి సెల్ కువైత్ ఓలేటి రెడ్డి చౌదరి మరియు షేక్ యం.డి అర్షద్ లు సమన్వయం చేశారని నిర్వహకులు ఒక ప్రకటనలో పెర్కోన్నారు.
283628722-1099503910603439-8198017283002198609-n
05282022080526n90
05282022080531n11
05282022082524n29
05282022082543n1
05282022082543n18
05282022082550n44