NRI-NRT

పేద విద్యార్థులకు తెరాస మలేషియా బాసట

పేద విద్యార్థులకు తెరాస మలేషియా బాసట

టిఆర్ఎస్ మలేషియా&నిర్మల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ. వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, టిఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత కలిసి బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల వెల్ఫేర్ సొసైటీ ద్వారా మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమం చేసినందుకు చిట్టిబాబుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో 59 డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు సుహాస్ మరియు 59 వ డివిజన్ టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు అరుంధతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.