Movies

చేయాల్సింది ఇంకా ఉంది

Auto Draft

నటనలో తనకెప్పుడూ సంతృప్తి దొరకలేదని చెబుతున్నది అగ్ర నాయిక కీర్తి సురేష్‌. ప్రతి సినిమా తనకు ఇంకా బాగా నటించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తుందని అంటున్నదామె. ఇటీవలే మహేష్‌ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి..అటు తమిళంలో ‘సాని కాయిదమ్‌’ అనే డీగ్లామర్‌, రివేంజ్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. నటిగా ఇలా రెండు తరహా చిత్రాలను సమతూకం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ..‘సాని కాయిదమ్‌’ తరహా పాత్రలు చేయడానికి ఎంత ఇష్టపడతానో, కమర్షియల్‌ చిత్రాల్లో నటించడానికీ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తాను. వేటికవి కొత్తగా ఉండే సినిమాల్లో నటించినప్పుడే నటిగా నాలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులు చూడగలరు. నా సినిమాలను నేను చూసుకోను. అలా చూస్తే నా నటనలోనే చాలా తప్పులు కనిపిస్తాయి. ఇంకా బాగా నటించాల్సింది కదా అనిపిస్తుంటుంది. విరామం దొరికితే కుటుంబంతో కలిసి కేరళ వెళ్తుంటాను. నా కుక్క పిల్ల నైకీతో ఆడుకుంటాను’ అని చెప్పింది. ప్రస్తుతం కీర్తి తమిళంలో ‘మామన్నన్‌’, మలయాళంలో ‘వాశి’, తెలుగులో నాని సరసన ‘దసరా’, చిరంజీవికి సోదరి పాత్రలో ‘భోళా శంకర్‌’ చిత్రాల్లో నటిస్తున్నది.