Business

గ్యాస్ సబ్సీడీ కి మంగళం.. ఇక మార్కెట్ ధరకు కొనాల్సిందే

గ్యాస్ సబ్సీడీ కి మంగళం.. ఇక మార్కెట్ ధరకు కొనాల్సిందే

డర్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేసింది. సాధారణ ప్రజానీకం ఇకపై మార్కెట్‌ ధరకే సిలిండర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయిల్‌ సెక్రటరీ పంకజ్‌ జైన్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ అందివ్వనున్నామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1003 ఉండగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్నారు. ఆ మొత్తం ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ లభించనుంది. సాధారణ గృహ వినియోగదారులు ఇకపై మార్కెట్‌ ధర ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందే. దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు ఉన్నారు. అంటే మిగిలిన 21 కోట్ల మంది సబ్సిడీకి దూరమైనట్లే. 2010లో పెట్రోల్‌పై సబ్సిడీని కేంద్రం ఎత్తివేయగా.. 2014 నవంబర్‌లో డీజిల్‌పైనా సబ్సిడీని తొలగించారు. అక్కడికి రెండేళ్లకు కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయగా.. తాజాగా గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీకీ కేంద్రం మంగళం పాడేసింది. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూపంలో ఊరట ఇచ్చిన కేంద్రం.. గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ రూపంలో భారం మోపింది.