మనసుకు నచ్చిన చిత్రాలకు ప్రేక్షకాదరణతో పాటు పురస్కారాలూ దక్కితే ఆ తారల సంతోషానికి హద్దేముంటుంది. ఈ ఆనందాన్ని ప్రస్తుతం పొందుతున్నది బాలీవుడ్ నాయిక కృతి సనన్. గతేడాది ఆమె నటించి ఘన విజయం సాధించిన ‘మిమి’ సినిమాకు తాజాగా ‘ఐఫా’ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారం గెల్చుకుంది కృతి. ‘మిమి’ సినిమాలో డబ్బు కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధమయ్యే అవివాహిత పాత్రలో కృతి నటన ప్రేక్షకులను మెప్పించింది. తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన ఈ సినిమాకు అవార్డు రావడం పట్ల కృతి సనన్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ…‘నాకెంతో పేరు తెచ్చిన చిత్రమిది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు ఇప్పుడు జ్యూరీ మనసులు గెలవడం ఆనందంగా ఉంది. తొలిసారి ఐఫాకు నామినేట్ అయి పురస్కారం దక్కించుకున్నా. ప్రభాస్తో నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని చెప్పింది. ప్రస్తుతం కృతి సనన్ టైగర్ ష్రాఫ్తో కలిసి ‘గణపథ్’, కార్తీక్ ఆర్యన్ సరసన ‘షెహజాదా’, చిత్రాల్లో నటిస్తున్నది.