Movies

ఇండిగో ఎయిర్ లైన్స్ తీరుపై మండిపడ్డ పూజా హెగ్డే

Auto Draft

ఈ మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ప లు సందర్బాల్లో వార్తల్లో నిలుస్తుండడం తెలిసిందే. రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారులు, సెలబ్రిటీలు, సామాన్యుల వరకూ వారి నికృష్టచేష్టలకు బలైనవారే. మొన్నీమధ్య ప్రముఖ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు .. 6E 608 విమానంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళుతుండగా.. గ్రౌండ్ స్టాఫ్ అజితేష్ అనే వ్యక్తి ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. తాజాగా అలాంటి అనుభవమే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కు ఎదురయింది. ఇండిగో 6E లోనే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలుపుతూ.. ఇండిగో సిబ్బంది తీరుపై పూజా మండిపడింది. ‘IndiGo6E స్టాఫ్ మెంబర్ దురుసుగా ప్రవర్తించినందుకు చాలా విచారంగా ఉంది. సిబ్బంది, విపుల్ నకాషే అనే వ్యక్తి ఈ రోజు ముంబై నుండి బయలుదేరిన మా విమానంలో మాతో అమర్యాదగా ప్రవర్తించాడు. ఎటువంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం, బెదిరింపు ధోరణితో అతడు ఈ పనిచేశాడు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను, కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది’ అంటూ పూజా ట్వీట్ చేసింది. దాంతో ఇండిగో ఎయిర్ లైన్స్ వారి తీరుపై నెటిజెన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. మరి ఇండిగోవారు అతడిపై ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.