Devotional

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్న సీజేఐ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ పండితులు జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు వేదాశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుమల ఆలయానికి చేరుకున్న సీజేఐకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.కాగా, తిరుమలలో భక్తుల రద్దీ అధికమయింది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. గురువారం శ్రీవారిని 70,019 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.52 కోట్ల ఆదాయం సమకూరింది.