‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో ముగ్గురు హీరోయిన్లకు అతిథులుగా ఆహ్వానం అందిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ‘గల్లీబాయ్’ వంటి సక్సెస్ ఫిల్మ్ తర్వాత హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (రాఖీ.. రాణీల ప్రేమకథ). కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్లో హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే అతిథులుగా కనిపించనున్నారన్నది బీ టౌన్ టాక్.