సోషల్మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింపులు జరుపుతున్నాయి. ఈ వరుసలో సమంత ముందున్నది అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ప్రకటనల ద్వారా ఈ భామ నెలకు మూడు కోట్ల వరకు ఆర్జిస్తున్నదని తెలిసింది. ఇటీవలే ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల్లో పలు బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయి. సమంతకు ఇన్స్టాగ్రామ్లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ‘ఫ్యామిలీమెన్-2’ వెబ్సిరీస్తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. యువతరంలో ఈ భామకున్న క్రేజ్ దృష్ట్యా ఇన్స్టాగ్రామ్ ప్రకటనల కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నదని తెలిసింది. ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’ ‘యశోద’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.