NRI-NRT

భారతీయులపై వీసా ఆంక్షలు ఎత్తివేసిన చైనా

Auto Draft

కరోనా కారణంగా గత రెండేళ్లుగా వీసాల మంజూరుపై విధించిన ఆంక్షలను చైనా ఎత్తివేసింది. ఈ ఆంక్షల కారణంగా స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చిన చాలా మంది భారతీయ వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. చైనా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తిరిగి చేరడానికి ఆసక్తి చూపుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల వినతులను కూడా పరిశీలించనుంది. ఈ మేరకు సోమవారం భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం వీసా విధానాన్ని ప్రకటించింది. అయితే టూరిస్టు వీసాలు, ప్రయివేటు కార్యకలాపాల వీసాలపై ఆంక్షలు మాత్రం కొనసాగనున్నాయి.