తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై మూడున లండన్లో నిర్వహించే టాక్ -లండన్ బోనాల జాతర పోస్టర్ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిషరించారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న టాక్ సంస్థను మంత్రి అభినందించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించినట్టు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల పేర్కొన్నారు. టాక్ సంస్థను ప్రోత్సహిస్తున్న మంత్రికి, సంస్థ ఆవిర్భావం నుంచి తమ వెంట ఉండి నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై నాయకులు రాజ్కుమార్ శానబోయిన, శ్రీనివాస్ వల్లాల, విద్యార్థి నాయకుడు ప్రమోద్ కకెర్ల తదితరులు పాల్గొన్నారు.