Movies

అంత తీరిక లేదు

Auto Draft

తన వ్యక్తిగత జీవితంపై వచ్చే పుకార్ల గురించి ఏమాత్రం పట్టించుకోనని, ప్రతి విషయంపై స్పందిస్తే జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతామని చెప్పింది బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. ‘షేర్షా’ చిత్రంలో తనతో కలిసి నటించిన హీరో సిద్ధార్థ మల్హోత్రాతో ఈ భామ ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు గాసిప్స్‌ వెలువడ్డాయి. వీటిపై కియారా అద్వాణీ స్పందిస్తూ ‘ఇలాంటి వార్తల్ని సృష్టించే వారు ఏం ఆశిస్తారో అర్థం కాదు. ప్రేమ, బ్రేకప్‌, పెళ్లి…అంటూ అవాస్తవాల్ని ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. ఇలాంటి వార్తల్ని పట్టించుకునే తీరిక ఏ మాత్రం లేదు. నా వ్యక్తిగత విషయాల గురించి నా కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే చర్చిస్తాను. ప్రస్తుతం నేను కెరీర్‌ మీదనే దృష్టిపెడుతున్నా. నటిగా నేనేమిటో నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నా’ అని చెప్పుకొచ్చింది. తెలుగులో ఈ భామ రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌ చిత్రంలో నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.