Business

ఈ ఏడాది చివ‌ర్లో 5జీ నెట్‌వ‌ర్క్‌

ఈ ఏడాది చివ‌ర్లో 5జీ నెట్‌వ‌ర్క్‌

ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి తెస్తామ‌ని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విదేశాలతో కంపేర్ చేస్తే 5జీ రేట్లు దేశంలో తక్కువగానే ఉంటాయన్నారు. ప్రస్తుతం దేశంలోని మొబైల్‌ డేటా చార్జీలు ప్రపంచంలోనే చాలా తక్కువని వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడిన అశ్విని వైష్ణవ్, 5 జీ గురించి ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ఈ ఏడాది చివరి నాటికి 20-25 నగరాల్లో 5జీ సేవ‌లు అందుబాటులోకి వస్తాయ‌ని నమ్మకంతో చెబుతున్నానని అన్నారు. విశ్వసనీయ నెట్‌వర్క్ ప్రొవైడర్ల జాబితాలో దేశం పేరు టాప్‌లో ఉంద‌ని తెలిపారు. ఇక‌.. ప్రపంచ వ్యాప్తంగా డేటా రేట్లు సగటున 25 డాలర్లు ఉండగా దేశంలో కేవలం 2 డాలర్లుగానే ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ నేపథ్యంలో 5 జీ డేటా రేట్లు కూడా దీనికి త‌గ్గ‌ట్టుగానే ఉంటాయని చెప్పారు. ‘భారత టెలికామ్‌ కొత్త శకానికి 5 జీ నాంది’ అని అభివర్ణించారు. 5 జీ టెక్నాలజీతో పాటు రాబోయే 6 జీ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఆవిర్భవించే సమయం ఎంతో దూరంలో లేదని అన్నారు. అయితే.. 5జీ స్పెక్ట్రం బ్యాండ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈ నెలాఖరులో వేలం జరుగవచ్చని భావిస్తున్నారు. 72జీ హెడ్జ్‌ను 20 సంవత్సరాలకు అమ్మనున్నారు. 5 జీ సేవలు 4 జీ కంటే పది రెట్లు వేగంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు._