రుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో జూన్ 18 వ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో – బే ఏరియా లో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. APNRTS…. బే ఏరియాలోని కార్య నిర్వాహక వర్గం ధార్మిక, సేవా సంస్థలతో ముందునుండే కళ్యాణోత్సవంలో ఎక్కడా ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు సమన్వయము చేస్తూ వచ్చింది. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు,వేద పండితులు శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ముఖ ద్వారం నుండి కళ్యాణ వేదిక వరకు పువ్వులతో అలంకరణ చూసిన ప్రతి ఒక్కరికి కనులపండుగలా ఉంది…ఏడు ద్వారాలు ఏర్పాటు చేసి ఆ ద్వారాల పేర్లు రాయడం భక్తులకు నిజంగా తిరుమలకు వెళ్ళిన భావన కలిగించింది. శ్రిదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం తిలకించిన భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కళ్యాణంలో తితిదే అధ్యక్షులు శ్రీ వై.వి. సుబ్బా రెడ్డి దంపతులు, ఏఈఓ శ్రీ వెంకటేశ్వర్లు, APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, కోఆర్డినేటర్లు, బే ఏరియాలోని ప్రముఖులు, అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.