Devotional

ఆషాఢ బోనాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం

ఆషాఢ బోనాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం

తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించే ఆషాఢం బోనాల జాతర ఉత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ముందుగా గోల్కొండ కోట నుంచి బోనాల ఉత్సవాల ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేయనుంది. ఏర్పాట్లపై ఈ నెల 21 వ తేదీన ఉదయం 11.00 గంటలకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వద్ద జరగనున్నాయి. ఈ సమావేశంలో దేవాదాయ, GHMC, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులు పాల్గొననున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన,శాంతిభద్రతలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారులు తెలిపారు.